ది కేరళ స్టోరీ : ఇప్పుడు ఓటీటీలో!

ది కేరళ స్టోరీ : ఇప్పుడు ఓటీటీలో!
Cinema News

సాధారణంగా థియేటర్లలో విడుదల అయిన మూవీ లు నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తాయి. అయితే కొన్ని మూవీ లు నెలల తరబడినా ఓటీటీలోకి రావడం లేదు. అందులో అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ మూవీ ఒకటి. డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించారు.

మే 5న విడుదలైన ఈ కాంట్రవర్సీ మూవీ లాంగ్‌ రన్‌లో ఏకంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ బడ్జెట్‌ కేవలం రూ. 35 కోట్లే . కేరళలో వివాదాస్పదమైన లవ్‌ జిహాద్‌ నేపథ్యంలో తెరకెక్కిన ది కేరళ స్టోరీ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

ది కేరళ స్టోరీ   : ఇప్పుడు ఓటీటీలో!
The Kerala Story

అయితే.. దేశంలో చర్చనీయాంశంగా నిలిచిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఎట్టకేలకు OTT లోకి వచ్చేసింది. గతేడాది మే 5న విడుదలైన ఈ మూవీ ఇవాల్టి నుంచి జీ5 OTT లో హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. చిన్న మూవీ గా విడుదలై భారీ కలెక్షన్లు సాధించగా…. ఇందులో ప్రధానపాత్ర పోషించిన ఆదాశర్మ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. కేరళలో వేలమంది మహిళలు మిస్ అయినట్లు వచ్చిన ఆరోపణలతో ఈ మూవీ ను తెరకెక్కించారు.