అంబులెన్స్‌కు దారి ఇచ్చిన లక్షలాది మంది భక్తులు.. వీడియో

The millions of pilgrims who led the ambulance
పూరీ జగన్నాథ్ రథయాత్ర జులై 4 న జరిగింది తెలుసు కదా. ఒడిశాలోని పూరీలో జగన్నాథ్ రథయాత్ర కన్నుల పండుగలా జరిగింది. లక్షల మంది భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పూరీ జగన్నాథుడి రథయాత్రను అక్కడ అంగరంగ వైభవంగా జరుపుతారు.

అయితే.. ఈసారి జరిగిన జగన్నాథుడి రథ యాత్రలో ఓ అద్భుతమైన ఘటన చోటు చేసుకున్నది. లక్షల మంది భక్తుల మధ్య జగన్నాథుడు ఊరేగుతుండగా.. సడెన్‌గా అంబులెన్స్ సైరన్ వినిపించింది. వెంటనే లక్షల మంది జనం అడ్డుతప్పుకోగా… 1200 మంది వాలంటీర్లు కొన్ని గంటల పాటు కష్టపడి.. అంబులెన్స్‌కు దారి ఇవ్వడం కోసం మానవ హారంలా నిలబడ్డారు. దీంతో అంబులెన్స్ లక్షలాది భక్తుల మధ్య నుంచి పరుగులు పెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

https://twitter.com/i/status/1147585977772195840