లలితా జ్యువెలరీలో భారీ చోరీ

లలితా జ్యువెలరీలో భారీ చోరీ

తమిళనాడు,తిరుచ్చి గాంధీనగర్‌లోని లలితా జ్యువెలరీలో చొరబడి భారీగా బంగారంతో పాటూ మరికొన్ని ఆభరణాలు ఎత్తుకెళ్లారు. షాప్‌ వెనుక వైపు గోడకు కన్నం వేసిన దొంగలు లోపలికి చొరబడ్డారు. షాపులో ఉన్న బంగారం మొత్తాన్ని ఊడ్చేశారు. దోపిడీ చేసిన బంగారం విలువ రూ.20కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దోపిడీ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

డ్రిల్లింగ్ మెషిన్ సాయంతో షాప్ వెనుక వైపు కన్నం వేసినట్లు అనుమానిస్తున్నారు. మొహాలకు మాస్కులు ధరించి షాపు లోపలికి వెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాదు దొంగలు చోరీ తర్వాత దొంగలు బయటకు వెళ్తున్న దృశ్యాలు షాపు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా దొంగల్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.

ఈ లలితా జ్యువెలరీ మూడంతస్తుల భవనంలో ఉంటే.. గ్రౌండ్ ఫ్లోర్‌లోని మొత్తం నగలు దొంగలు ఊడ్చేశారు. దొంగలు కూడా పక్కా ప్లాన్‌తో చోరీకి కొద్దిరోజులు ముందు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.