పాతిబస్తీలో దారుణం… ముగ్గురికి కత్తిపోట్లు

తెలంగాణలోని హైదరాబాద్‌ పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. కేవలం రూ.1200 వ్యవహారం కలిసిమెలిసి ఉన్న ముగ్గురు స్నేహితుల మధ్య చిచ్చు పెట్టింది. అదికాస్త కత్తిపోట్లకు దారితీసింది.
అసలు విషయం ఏమిటంటే.. పాతబస్తీ కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాబా నగర్‌లో మెడికల్ షాప్‌కు వెళ్లిన మిహసీన్, ఈర్షద్, ఆర్షద్ అనే ముగ్గురు స్నేహితులు… రూ. 1200 విషయంలో గొడవ పడ్డారు. ఇంతలో అక్కడి నుండి వెళుతోన్న అలీ అనే వ్యక్తి విడిపించడానికి ప్రయత్నం చేస్తుండగా..

ఈలోపే.. మిహసీన్ అనే వ్యక్తి కత్తితో ముగ్గురిపై దాడికి దిగాడు. కాగా ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా.. అక్కడి నుంచి మిహసీన్ పరారు అయ్యాడు. కాగా స్థానికులు అందించిన సమచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి.. దాడిలో గాయపడిన ముగ్గురు యువకులను ఆస్పత్రికి తరలించారు.