సీఎం ఆదేశాలతో వెనకడుకుగు… ఆరోజు ఫైనల్ చేస్తాం !

Tirumala TTD EO Anil Kumar call Urgent Meeting

మహా సంప్రోక్షణ సమయంలో శ్రీవారి దర్శనాన్ని ఆరు రోజుల పాటు పూర్తిగా నిలిపివేస్తున్నట్టు టీటీడీ తీనుకున్న నిర్ణయంపై వివాదం చెలరేగడంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని కొన్ని సూచనలు చేసిన విషయం తెలిసిందే. ఈ మహా క్రతువు నిర్వహించే రోజుల్లోనూ పరిమితి సంఖ్యలో భక్తులను దర్శనాలకు అనుమతించేలా కార్యాచరణను రూపొందించాలని చంద్రబాబు నుంచి ఆదేశాలు రావడంతో టీటీడీ బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ ప్రకటించారు. ఈ సమావేశంలో చైర్మన్, పాలకమండలి సభ్యులు పాల్గొంటారని ఈఓ తెలియజేశారు. అయితే, సమావేశం కంటే ముందు దర్శనాల విషయంలో భక్తుల అభిప్రాయాలను కూడా సేకరిస్తామని ఆయన తెలిపారు.

మహాసంప్రోక్షణ సమయంలో దర్శనాలపై విదివిధానాల గురించి ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటాని వెల్లడించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని చంద్రబాబు ఆదేశించారని, ఆయన ఆదేశాల ప్రకారం బోర్డు సమావేశంలో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. మహాసంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని కొద్దిరోజుల పాటు పూర్తిగా మూసివేయాలని తీసుకున్న నిర్ణయంపై భక్తులు తమ అభిప్రాయాలు తెలియజేయాలని ఈవో కోరారు. జులై 24న టీటీడీ బోర్డు సమావేశం ఉన్నందున అప్పటిలోగా భక్తుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.