సాయి పల్లవిని వివాహం చేసుకుంటానంటున్న మెగా ప్రిన్స్

సాయి పల్లవిని వివాహం చేసుకుంటానంటున్న మెగా ప్రిన్స్

మెగా ఫ్యామిలీ ప్రిన్స్ వరుణ్ తేజ్  తాజాగా ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఆయన తన నటవిశ్వరూపంతో భయపెట్టేశారు. కానీ, బయట మాత్రం వరుణ్ చాలా మృదుస్వభావి. చాలా కామ్‌గా ఉంటారు. పెద్దగా ఎవ్వరితోనూ మాట్లాడరు. అలాంటి వ్యక్తి నుంచి మంచు లక్ష్మి చాలా విషయాలు రాబట్టారు.

మంచు లక్ష్మి హోస్ట్ చేస్తోన్న తెలుగు రియాలిటీ షో ‘ఫీట్ అప్ విత్ ద స్టార్స్’లో వరుణ్ తేజ్ పాల్గొన్నారు. ఎన్నో వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. మంచు లక్ష్మి అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మొత్తానికి ఇప్పటి వరకు బయటికి తెలియని చాలా విషయాలను వరుణ్ నుంచి మంచు లక్ష్మి రాబట్టారు. వీటిలో యువతకు బాగా నచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి.

‘‘సాయి పల్లవి, రాశీ ఖన్నా, పూజా హెగ్డేలలో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావ్, ఎవరిని చంపేస్తావ్, ఎవరితో రిలేషన్‌షిప్ పెట్టుకుంటావ్?’’ అని మంచు లక్ష్మి అడిగితే  సాయి పల్లవిని పెళ్లిచేసుకుంటా అని వరుణ్ టక్కున సమాధానం చెప్పారు. ఎందుకు అని అడిగితే ఒకమ్మాయిని పెళ్లిచేసుకోవడానికి కావాల్సిన అన్న లక్షణాలు ఆమెలో ఉన్నాయని చెప్పారు. అయితే, పూజా హెగ్డేతో తాను సంబంధం పెట్టుకుంటానని, రాశీ ఖన్నాను చంపేస్తానని సరదాగా చెప్పారు.