విక్రమ్‌ 58వ చిత్రం.. లుక్‌ రిలీస్ !

విక్రమ్‌ తాను నటించిన ప్రతి సినిమాలోనూ, ప్రతి పాత్రలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తన నటన తో ఎంతో మంది అభిమానులని సంపాదించుకొన్న నటుడు .ఐతే ఇటీవలే కాలంలో సరైన హిట్ లేక సతమతమవుతున్న విక్రమ్ ప్రస్తుతం తన 58వ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. విక్రమ్ కెరియర్ లో ‘డిమాంటి కాలనీ’, ‘ఇమైకా నొడిగల్‌’ వంటి బ్లాక్‌బస్టర్లను ఇచ్చిన అజయ్‌ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండగా 7 స్క్రీన్‌ స్టూడియో బ్యానరుపై లలిత్‌కుమార్‌ భారీ బడ్జెట్‌తో దీనిని తెరకెక్కించనున్నారు. బ్రహ్మాడమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్‌ ఆగస్టులో ప్రారంభం కానుంది అని చిత్రవర్గాలు ప్రకటించాయి. 2020లో వేసవి వినోదాత్మక చిత్రంగా దీన్ని విడుదల చేయనున్నారు అని తెలుస్తుంది.