2024 ఎన్నికల్లో ఏపీ ప్రజల విజన్ ఎవరివైపు ?

Who is the vision of AP people in 2024 elections?
Who is the vision of AP people in 2024 elections?

ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పేదలకు సంక్షేమ పథకాలు కావాలి. సగటు మధ్యతరగతి కుటుంబాలకు ధరలు అదుపులో ఉండాలి. ఆపై రహదారులు విశాలంగా కనిపించాలి. ఒక్క నిమిషం కూడా పవర్ కట్ లేకుండా చూడాలి. అయితే ఏపీ ప్రజలు సైతం దురదృష్ట వశాత్తు అభివృద్ధి, సంక్షేమం అన్న వర్గాలుగా విడిపోయారు.

1999లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. అప్పుడే విజన్ 20-20 అన్న స్లోగన్ ను అందుకున్నారు. అయితే ఆ సమయం వచ్చిందే కానీ..ఇప్పుడు ఆయన అధికారంలో లేకుండా పోయారు. కానీ నాడు చంద్రబాబు చెప్పిన 20-20 విజన్ అనేది ప్రజల్లో కనిపిస్తోంది.. ఇప్పుడు నేడు 2047 విజన్ తో చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అదే తనకు పదవి తెచ్చి పెడుతుందని నమ్మకంతో ఉన్నారు. ఒక్క సంక్షేమ పథకాలు లబ్ధిదారులు తప్పించి.. సమాజంలో మెజారిటీ సెక్షన్ తన వైపు వస్తుందని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు.

ఏపీ సీఎం జగన్ గత ఎన్నికల ముందు తన విజన్ ఏంటో ప్రకటించారు. నవరత్నాలు అమలు చేసి సంక్షేమ పాలన అందిస్తామని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే కొంతవరకు అమలు చేశారు. సంక్షేమానికి తానే బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకొస్తున్నారు. కానీ చంద్రబాబు మాదిరిగా విజన్ కనిపించలేదు. రహదారులు బాగాలేదు.. పరిశ్రమల జాడలేదు.. రియల్ బూమ్ పడిపోయింది. ఒక్క సంక్షేమం తప్పించి అన్ని ప్రతికూలతలే. జగన్ పేదరికం లేని సమాజమే తన నవరత్నాల లక్ష్యమని చెబుతూ వస్తున్నారు.

ప్రజల ఆర్థిక స్థితిగతులు పెరగడం మంచిదే.. అదే సమయంలో అభివృద్ధి, మౌలిక వసతులు కీలకం. కానీ ఎంపికే కష్టం. అయితే ప్రతి ఐదేళ్లకు ఏపీ ప్రజలు ట్రెండ్ మారుస్తుంటారు. 2014లో బాబు విజన్ కు జై కొట్టారు. 2019లో మాత్రం జగన్ నవరత్నాలకు మొగ్గు చూపారు. 2024 ఎన్నికల్లో ఎటువైపు ఆసక్తి చూపుతారో చూడాలి మరి.