ఎంపీల సమావేశం వీడియో తీసింది వారేనా ?

బరువు తగ్గడానికి దీక్షలు చేయాలని, విశాఖకు రైల్వే జోనూ లేదు, గీనూ లేదని, దీక్ష చేస్తే ఒక్కరోజులోనే ఆసుపత్రికి తరలించాలని వ్యంగ్యోక్తులు విసురుకుంటూ ఉన్న ఒక వీడియో తెలుగుదేశం పార్టీ పరువు తీసిన వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అసలు ఈ వీడియోను ఎవరు తీశారు? ఏ ప్రయోజనాలు ఆశించి బయటకు విడుదల చేశారన్న కోణంలో విచారణ జరిపించాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారట.

ఎంపీల చలోక్తులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన, జోకులేసుకునేందుకూ ఓ సందర్భం ఉంటుందని, పార్టీ నేతల పోరాటానికి విలువ లేకుండా మాట్లాడటం ఏంటని మురళీమోహన్, అవంతి శ్రీనివాస్ తదితరులకి నిన్న ఫోన్ లోనే తలంటేశారు. అసలు ఈ వీడియోను ఎవరు తీశారు ? అనే కోణంలో చూస్తే కాగా, ఎంపీల వ్యక్తిగత సిబ్బందే ఈ వీడియోను తీసుంటారని భావిస్తున్నారు, సదరు వీడియో ఎవరు తీశారన్న విషయాన్ని వీలయినంత త్వరగా తేల్చనున్నట్టు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.