భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి

భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య మృతి చెందిన ఘటన తిరుపత్తూరు జిల్లాలో విషాదాన్ని నింపింది. వానియంబాడి తాలుకా కచ్చేరి రోడ్డుకు చెందిన అన్నామలై(78), లక్ష్మమ్మాల్‌(65) దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. అన్నామలై వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు.

శుక్రవారం అన్నామలై గుండె పోటుతో మృతి చెందారు. అన్నామలై మృతదేహంపై రోదిస్తూ లక్ష్మమ్మాల్‌ కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అన్నామలై మృతి చెందిన పది నిమిషాల్లోనే లక్ష్మమ్మాల్‌ కూడా కన్నుమూయడం పలువురిని కలచివేసింది.