మంత్రగత్తెలని అనుమానంతో మలం తినిపించి.. అర్థనగ్నంగా..

కాలం మారుతున్నా మూఢనమ్మకాలపై నమ్మకం తగ్గడం లేదు జనాలకు. బిహార్‌లో నమ్మకాలకు సంబంధించిన అమానుషమైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. మంత్ర‌గ‌త్తెల‌న్న అనుమానంతో ముగ్గురు మ‌హిళ‌ల‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది.

అసలేం జరిగింది అంటే… బీహాల్ లోని ముజ‌ఫ‌ర్‌పూర్‌లోని డ‌క్రామా గ్రామంలో ముగ్గురు మ‌హిళ‌ల‌ను గ్రామ‌స్తులు మంత్ర‌గ‌త్తెలుగా అనుమానించారు. దాంతో వారివ‌ల్ల త‌మ‌కు ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని భావించిన గ్రామ జనం అంతా ఏక‌మై వారిపై దాడికి దిగారు. ఆ తర్వాత ఏం చేశారంటే.. ముగ్గురు మ‌హిళ‌లకు గుండు గీయించి, అర్ధ‌న‌గ్నంగా ఊరేగిస్తూ పైశాచికత్వాన్ని ప్ర‌ద‌ర్శించారు.

అంతటితో ఆగకుండా వారిచేత మ‌లం వంటి విస‌ర్జిత ప‌దార్థాలను తినిపిస్తూ నీచానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘ‌‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు పూర్తి విచార‌ణ జ‌రిపి.. నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వివరించారు.