దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం

దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం

కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు డివైడర్‌ని ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. దైవ దర్శనానికి వెళ్తూ మహిళ ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. మంత్రాలయం మండలం కల్లుదెవకుంట గ్రామం సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.వివరాలు ఇలా.. బెంగుళూరు నుంచి ఐదుగురు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి బయలుదేరి వచ్చారు.

డ్రైవర్ నిద్ర మత్తు, అతివేగం వల్ల కల్లుదెవకుంట సమీపంలో కారు కల్వర్టుకు ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న శారద అనే మహిళ తలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందింది. కారులోని ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో మిగిలిన నలుగురు సురక్షింతంగా బయటపడ్డారు. మృతురాలు శారద బెంగళూరు వాసిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.