పుట్టినరోజు వెన్యూ కోసం గొడవ…మూడేళ్ళ కూతురితో సూసైడ్ అటెంప్ట్ చేసిన మహిళ

woman suicide attempt with her three years child

కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఇక బ్రతకడం అనవసరం అనుకున్న ఓ మహిళ క్షణికావేశంలో రెండేళ్ల కుమార్తెతో కలిసి అపార్ట్‌మెంట్ పైనుంచి దూకేయగా, మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో శనివారం రాత్రి జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డివాడకు చెందిన తాడూరి రాంమోహన్‌కు పద్మజకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐశ్వర్య, అక్షర అనే ఇద్దరు కుమార్తెలు. కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌లోని అమృత నిలయం అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న దంపతులు ఈవెంట్ ఆర్గనైజర్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల బిజినెస్‌ సక్రమంగా సాగకపోవడంతో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. దీని కారణంగా భార్యభర్తలు తరుచూ గొడవ పడుతున్నారు. చిన్నారి కుమార్తె అక్షర పుట్టినరోజు వస్తుండటంతో ఎక్కడ చేయాలన్న దానిపై శనివారం దంపతులిద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో భర్తతో తీవ్రస్థాయిలో వాదులాడిన పద్మజ రాత్రి 11 గంటల సమయలో అక్షరతో కలిసి అపార్ట్‌మెంట్‌లోని ఫోర్త్ ఫ్లోర్‌ నుంచి కిందికి దూకేసింది. దీంతో షాకైన రాంమోహన్‌ భార్య, కుమార్తెను వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పద్మజ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. చిన్నారికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అక్షర పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు.