ఒకరితో పెళ్లి.. ఆపై లవర్ తో మరోపెళ్లి…చివరకు ఇంకో వ్యక్తితో జంప్ !

women-cheated-two-persons-in-koraput

పురాణా కాలం నుండి స్త్రీని దేవతలా కొలిచే పుణ్యభూమి మనది, కానీ ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు భారత సాంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నాయి. సాంప్రదాయాలకు నిలయమైన దేశంలో పాశ్చాత్య సాంస్కృతి విస్తరిస్తోంది. కొన్నిచోట్ల కట్టుకున్న భర్తే కాలయముడవుతుంటే ఈ విషయంలో తామేమి తక్కువ కాదనట్టు మహిళలు కూడా వ్యవహరిస్తున్నారు. ఒడిసా లోని కోరాపుట్ జిల్లలో జరిగిన ఘటన దేశంలో జరుగుతున్న ఘటనలు అన్నిటికీ పరాకాష్టగా మారింది. ఒకరితో తాళి కట్టించుకుని అతడితో రెండు రోజులు గడిపి, ప్రేమించిన మరో వ్యక్తి చేయిపట్టుకొని అతడితో ఐదు దినాలు ఉండి, ఇంకొక వ్యక్తితో ఓ మహిళ జంప్‌ అయింది. వినడానికి, ఊహించుకోడానికి భయంకరంగా ఉన్న ఈ ఘటన కలకలం రేపుతోంది.

కోరాపుట్ జిల్లాలోకు చెందిన ఓ యువతికి పెద్దలు అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి చేశారు. అతనితో రెండు రోజులపాటు కాపురం చేసింది. ఆ తర్వాత తాను ఒక యువకుడిని ప్రేమించానని తల్లిదండ్రులతో, కట్టుకున్న భర్తతో తెగేసి చెప్పి పోలీసుల సమక్షంలో ప్రేమికుని మెడలో పూల దండలు వేసింది. అతనితో మరో ఏడడుగులు వేసింది. ఇతడితో కేవలం ఐదు రోజులు మాత్రమే సంసారం చేసింది. ఆ తర్వాత మరో వ్యక్తితో జంప్‌ అయింది. ఇది కొరాపుట్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో పోలీసుల సమక్షంలో ఆమె మెడలో పూలదండ వేసి పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడైన రెండో భర్త తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమె ఒక యువకుని సైకిల్‌ ఎక్కి వెళ్లిపోయినట్టు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఆమె ఎక్కడకు వెళ్లింది? ఎందుకు వెళ్లింది? ఆమె మనసులో ఏముంది అనేది మాత్రం తెలియడంలేదు. దీంతో అన్ని పోలీస్‌ స్టేషన్లుకు ఆమె ఫొటోలు పంపి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.