కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం

కలెక్టరేట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం

మూడు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు వేరే వారి పేరు పైన రికార్డుల్లోకి ఎక్కించారంటూ అనంతపురం జిల్లా పెద్దవడగూరుకు చెందిన దేవమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆవేదనకు లోనై తనకు న్యాయం చేయాలంటూ కిరోసిన్ పోసుకుని ఆత్మ హత్యాయత్నానికి పాల్పడగా మహిళను కలెక్టర్ దగ్గరకు పోలీసులు తీసుకు వెళ్లారు.

కలెక్టరేట్‌లోని “స్పందన” కార్యక్రమంలో ఈ మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. సకాలంలో గుర్తించిన పోలీసులు కలెక్టర్‌ దగ్గరకి తీసుకు వెళ్ళగానే దేవమ్మ తనకి న్యాయం చేయమని వేడుకుంది.