చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం

టాలీవుడ్ సినీ పాటల రచయిత చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయనకి మాతృవియోగం కలిగింది. ఈ ఉదయం చంద్రబోస్ మాతృమూర్తి గుండెపోటుతో హైదరాబాద్ లోని స్వగృహంలో మరణించారు. ఈ సాయంత్రం చిట్యాల మండలంలోని చల్లగిరి గ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం. చంద్రబోస్ గేయ రచయితగా టాలీవుడ్ లో మంచిపేరు తెచ్చుకున్నారు. ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాశారు. 1995లో తాజ్ మహల్ సినిమాతో సినీగేయ రచయితగా ఇండస్ట్రీకి పరిచయం అయి అప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాది పాటలు రాశారు. వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని చల్లగిరి గ్రామంలో సాయంత్రం జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నరసయ్య, మదనమ్మ దంపతులకు నలుగురు సంతానం. చంద్రబోస్ అందరిలో చిన్నవాడు. తన తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను ఇంతటి వాడినయ్యానంటూ బోస్ పలు వేదికలపై మాతృభక్తిని చాటుకునేవారు.