ప్రియుడిని చెట్టుకు కట్టేసి యువతి మీద గ్యాంగ్ రేప్

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఓ యువతిపై గ్యాంగ్‌రేప్ జరిగింది. మద్యం మత్తులో ఆరుగురు కామాంధులు ప్రియుడి ఎదుటే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మైసూరు నగర శివార్లలోని లింగాంబుధి చెరువు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మైసూరులోని ఓ లాడ్జిలో పనిచేస్తున్న ఓ యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం రాత్రి వీరిద్దరూ ఏకాంతంగా గడిపేందుకు లింగాంబుధి చెరువు వద్దకు వెళ్లారు. అదే సమయంలో ఆరుగురు యువకులు కారులో అక్కడికి చేరుకున్నారు. మద్యం మత్తులో యువతిని చూసిన ఆ కామాంధులు రెచ్చిపోయారు. యువకుడిని తాళ్లతో చెట్టుకు కట్టేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న జయపుర పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నిందితులను పట్టుకొనేందుకు మూడు బృందాల్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు ప్రకటించారు.