పాదయాత్రకు విరామం

పాదయాత్రకు విరామం

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పాదయాత్రకు విరామం ఇస్తున్నట్లు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే పాదయాత్ర పునఃప్రారంభమవుతుందన్నారు. 21 రోజుల పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకున్నానన్నారు.

పాదయాత్రలో ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపామని పేర్కొన్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని.. రైతులకు మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి 72 గంటల నిరాహార దీక్ష చేపడుతున్నట్లు వైఎస్‌ షర్మిల తెలిపారు.