చిరంజీవి అలక నిజం అయి ఉండదని మెగా ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి ఆహా లో రాబోతోన్న తెలుగు ఇండియన్ ఐడల్ఫినాలే ఈవెంట్‌కు గెస్టుగా రాబోతోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అది నిజమో కాదో తెలియడం లేదు. కానీ ఆ న్యూస్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆహా కోసం వచ్చిన చిరంజీవి అసహనం వ్యక్తం చేశాడట. హోస్ట్ ఏదో తప్పుగా చెప్పి.. మళ్లీ రీటేక్ తీసుకోవడంపై చిరంజీవి అసహనం వ్యక్తం చేశాడని, దాంతో సెట్ నుంచి త్వరగా వెళ్లిపోయాడని టాక్.

ఈవెంట్ అంతా అయిపోయిన తరువాత ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. అప్పటికే విన్నర్ ఎవరో ప్రకటించేశారని, విజేతకు ట్రోఫీ కూడా అందజేశారని సమాచారం. మొత్తానికి చిరంజీవి అలక మాత్రం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇది నిజం అయి ఉండదని మెగా ఫ్యాన్స్ అంటుంటే.. యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇంకోలా ట్రోల్స్ చేస్తున్నారు.