రాంగోపాల్ వర్మ అరెస్ట్

RGV Bhairava Geetha Movie Postponed

వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ సినిమా ఇటీవల తెలంగాణలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఏపీలో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో మే 1న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సంధర్భంగా ఆదివారం రోజున విజయవాడ నోవాటెల్ లో ప్రెస్ మీట్‌ను నిర్వహిస్తున్నట్లు వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ ప్రెస్ మీట్ జరగనున్నట్లు చెప్పారు.‘మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం’ అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు వర్మ. అలా విజయవాడ వెళ్లిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎయిర్‌పోర్టును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నడిరోడ్డుపై లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెడతానంటూ ట్విట్టర్‌లో చెప్పిన వర్మ…అనుకున్న ప్రకారం విజయవాడకు బయల్దేరారు. దీంతో అక్కడ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే వర్మను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రెస్ మీట్‌కు పర్మిషన్ లేదన్నారు.