ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని పదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని పదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
ముంబయిలోని మలాద్ ప్రాంతంలో నివసించే మంగేష్ రాణె ఓ హౌస్ కీపింగ్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఏడాదిన్నరగా అతడు ఇంటర్ విద్యార్థినితో ప్రేమాయణం నడుపుతున్నాడు. అప్పుడప్పుడు త్రివేణి నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ పదో ఫ్లోర్‌లో ఉండే ఆమె ఇంటికి వెళ్తుండేవాడు.
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ప్రియురాలి తల్లి లేని సమయంలో ఆమె ఇంటికి మంగేష్ వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఆ యువతి మంగేష్‌కు బ్రేకప్ చెప్పేసింది. నీతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు, మన బంధానికి ఇక్కడితో ముగింపు పలుకుదాం అని చెప్పింది. దీంతో రెచ్చిపోయిన మంగేష్ కత్తితో ప్రియురాలిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆందోళన పడి చేయి కోసుకుని పదో అంతస్తు నుంచి దూకేశాడు. దీంతో మంగేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అతడి ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.
యువతి తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తన కూతురిని పెళ్లి చేసుకుంటానని మంగేష్ నెల రోజుల క్రితం కోరగా అంగీకరించామని, ఇంతలోనే ఈ దారుణం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.