సీఏసీ పదవికి రాజీనామా

సీఏసీ పదవికి రాజీనామా

సీఏసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వ్యాఖ్యాతగా, భారతక్రికెటర్లసంఘం సభ్యుడిగా కొనసాగుతున్న మాజీ ఆటగాడు కపిల్‌దేవ్‌ తెలిపారు.ఇందుకు కారణాలని తెలుపని కపిల్‌దేవ్‌ పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశంపై నోటీసుల రావడం వల్లే అని అతని సన్నిహితవర్గాలు తెలిపాయి.

బీసీసీఐ టీమిండియా హెడ్‌ కోచ్‌తో పాటు క్రికెట్‌ సలహా మండలి(సీఏసీ)ని ముగ్గురుసభ్యులతో జులైనెలలో ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. బీసీసీఐ నైతిక విలువల అధికారి అయిన జస్టిస్‌డీకే పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంపై వివరణఇవ్వాలని కపిల్‌దేవ్‌కి నోటీసులుపంపారు.ప్రస్తుతం కపిల్‌దేవ్‌నేతృత్వంలో క్రికెట్‌సలహా మండలి సభ్యలుగా వ్యవహరిస్తున్నారు.