ఆస్కార్‌ బరిలోకి అక్షయ్‌ కుమార్‌ సినిమా!

ఆస్కార్‌ బరిలోకి అక్షయ్‌ కుమార్‌ సినిమా!
Movie News

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ సినిమా ఆస్కార్ బరిలో నిలవనుంది. టిను సురేష్‌ దేశాయ్‌ తెరకెక్కించిన ‘మిషన్‌ రాణిగంజ్‌’.. ‘ది గ్రేట్‌ భారత్‌ రెస్క్యూ’ అనే సినిమా ఆస్కార్‌ రేసులో పోటీ పడేందుకు జనరల్‌ కేటగిరిలో ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసింది. దీంతో ఈ చిత్రానికి సోషల్‌ మీడియాలో ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఆస్కార్‌ బరిలోకి అక్షయ్‌ కుమార్‌ సినిమా!
Akshay Kumar

గతంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ కూడా ఇలానే ఇండిపెండెంట్‌గా కొన్ని కేటగిరీల్లో నామినేషన్‌ వేసింది. ‘ఆస్కార్‌ 2024’ అధికారిక ఎంట్రీ కోసం పలు భారతీయ చిత్రాలు పోటీ పడగా, జ్యూరీ మలయాళ మూవీ ‘2018’ను ఎంపిక చేసింది.

ఇక ‘మిషన్‌ రాణిగంజ్‌’ విషయాని వస్తే .. రాణిగంజ్‌ కోల్‌ఫీల్డ్స్‌లో 65మంది మైనర్లను కాపాడిన జశ్వంత్‌ సింగ్‌ గిల్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అక్షయ్‌ కుమార్‌ సరసన ఈ చిత్రం లో పరిణీతి చోప్రా నటించింది. అక్టోబర్‌ 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు కూడా వచ్చింది.