
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాకా’. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి సంబందించిన టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే, ఎన్నో అంచనాలున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రివీల్ అయ్యాక మాత్రం టోటల్ నెగిటివ్ టాక్ వినిపించింది. అది బన్నీ విషయంలో కాదు, దర్శకుడు అట్లీ విషయంలో కాదు. మరి, ఎవరి విషయంలో..పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్ళి చూద్దాం.
యావత్ సినీ లవర్స్, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కూడా బన్నీలో ఎక్కువగా ఇష్టపడేది డాన్స్. మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసే ట్యూన్స్, డాన్స్ కొరియోగ్రాఫర్స్ క్రియేట్ చేసే మూవ్మెంట్స్ కి కొత్త రూపం తెస్తాడు. అందుకే, ప్రత్యేకంగా సంగీత దర్శకులు ఫాస్ట్ బీట్, మాస్ స్టెప్పులు ఉండేందుకు అనుకూలంగా మ్యూజిక్ కంపోజ్ చేస్తుంటారు. పుష్ప సిరీస్లో మ్యూజిక్ ఎంత ప్రత్యేకంగా ఉంటుందో..అల్లు అర్జున్ డాన్స్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. పుష్ప పార్ట్ 1లో సమంతతో ఉన్న ఐటం సాంగ్ ఊ అంటావా మావా, రష్మిక మందన్నతో ఉన్న సామీ సామీ, శ్రీవల్లి సాంగ్స్ హైలెట్గా నిలిచాయి.
ఇక, పుష్ప 2లో శ్రీలీల తో ఉన్న కిసిక్ సాంగ్, రష్మికతో ఉన్న ఫీలింగ్స్ సాంగ్..సూసేకి అగ్గిరవ్వ సాంగ్ స్పెషల్ అని చెప్పాలి. అంతకముందు వచ్చిన అల వైకుంఠపురములో సాంగ్స్ అన్నీ బ్లాక్ బస్టర్. ఆ రకంగా అల్లు అర్జున్ కోసం రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్, మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సాంగ్స్, బీజిఎం విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. కానీ, ఇప్పుడు చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా రాకా మాత్రం మ్యూజిక్ పరంగా అభిమానులను డిసప్పాయింట్ చేసుందనే సందేహాలు వెల్లువెత్తాయి. దీనికి కారణం సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్.

ఇప్పుడిప్పుడే తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతున్న యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్. సూర్య నటించిన కరుప్పు పెద్ద సినిమా. ఇది ఫ్లాపవడం వల్ల పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయినా, అట్లీ ఏకంగా అల్లు అర్జున్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. కానీ, రాకా పోస్టర్ కి ఇచ్చిన థీమ్ మ్యూజిక్ బాగా డిసప్పాయింట్ చేసింది. ఎవరికీ నచ్చలేదు. దాంతో మ్యూజికల్ గా ఎంతవరకూ ఆడియన్స్ ని మెప్పిస్తుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అంతేకాదు, అట్లీ కూడా ఐ, కాష్మోరా సినిమాల లుక్ ని మిక్స్ చేసి బన్నీ లుక్ డిజైన్ చేసినట్టు ట్రోల్ చేశారు. ఇలాంటి, నెగిటివిటీ ఉన్న రాకా పై ఎలాంటి పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తారో చూడాలి. సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు 800 కోట్లతో నిర్మిస్తోంది. దీపిక పడుకొణె హీరోయిన్గా రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రమ్య కృష్ణ, యోగిబాబు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.





