ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన అల్లు అర్జున్ ప్రస్తుతం గీతాఆర్ట్స్ 2 బ్యానర్ను స్థాపించి చిన్న బడ్జెట్ చిత్రాలను కూడా నిర్మిస్తున్న విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన జంటగా తెరకెక్కిన గీత గోవిందం చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంను అల్లు అరవింద్ నిర్మించాడు. ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో అన్ని ఏరియాల్లో కూడా తానే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ చిత్రానికి దాదాపు 15 కోట్లను నిర్మాత ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 5 కోట్ల మేరకు ఆడియో రైట్స్ ఇతర రైట్స్ ద్వారా రికవరీ అయ్యింది. ఇంకా పది కోట్లు సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా ఈజీగానే వచ్చేవి. కాని సినిమాను అమ్మేయాలనే ఆలోచన అల్లు అరవింద్కు లేదు. ఈజీగా 15 నుండి 20 కోట్ల వసూళ్లు నమోదు అవుతాయని అల్లు అరవింద్ అంచనా వేస్తున్నాడు.
సినిమాపై ప్రస్తుతం యూత్ ఆడియన్స్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు పరుశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం యూత్ ఐకాన్గా ఉన్నాడు. అందుకే ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ను రాబట్టడం ఖాయంగా అనిపిస్తుంది. సినిమా ఫలితంతో సంబంధంలేకుండా ఓపెనింగ్స్ ఉంటాయని నిర్మాత అల్లు అరవింద్ భావిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో మరియు ఇతర ఏరియాల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయడం ద్వారా భారీ ఓపెనింగ్స్ను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు కూడా అంటున్నారు. మరి ఈ చిత్రంపై అల్లు అరవింద్ పెట్టుకున్న 10 కోట్ల నమ్మకం నిలిచేనా లేదా అనేది చూడాలి.