AP Politics: ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు… కేంద్ర మంత్రితో సమావేశం

AP Politics: Chandrababu to Delhi today for a meeting with the Union Minister
AP Politics: Chandrababu to Delhi today for a meeting with the Union Minister

ఇవాళ ఢిల్లీకి టీడీపీ పార్టీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్నారు చంద్రబాబు. పొత్తులపై చర్చించడానికి ఢిల్లీ రమ్మని చంద్రబాబు నాయుడుకు అమిత్ షా ఆహ్వానం అందించినట్లు సమాచారం. ఇక ఈ రాత్రికి అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ కానున్నారు టీడీపీ పార్టీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్‌ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. చంద్రబాబు, అమిత్ షా భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని హైకమాండుకు ఇప్పటికే మెజార్టీ ఏపీ బీజేపీ నేతల సూచనలు చేసినట్లు సమాచారం. కాగా ఇప్పటికే టీడీపీ-జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయి. అటు బీజేపీ-జనసేన పార్టీలు కూడా పొత్తులో ఉన్నాయి.