AP Politics: ఏపీ పేదలకు శుభవార్త.. పెన్షన్ల పంపిణీ గడువు పెంపు..!

AP Politics: Good news for the poor of AP.. Extend the deadline for distribution of pensions..!
AP Politics: Good news for the poor of AP.. Extend the deadline for distribution of pensions..!

ఏపీ పేదలకు గుడ్ న్యూస్‌.  పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ కూడా కొనసాగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పెన్షన్లను రూ. 3 వేలకు పెంచడంతో పాటు కొత్తగా 1.17 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

దీంతో జనవరి 1 నుంచి 8 వరకు వాలంటీర్లు పంపిణీ చేశారు. తర్వాత మరో రెండు రోజులు పొడిగించగా, ఇవాళ కూడా పంపిణీకి ప్రభుత్వం అనుమతించింది. 66.34 లక్షల మందికి గాను నిన్నటి వరకు 65.44 లక్షల మందికి పంపిణీ జరిగింది.