AP Politics: ఏపీ, తెలంగాణకు KRMB ఆదేశాలు.. నిధులు విడుదల చేయాలి

AP Politics: KRMB directives to AP, Telangana.. Funds should be released
AP Politics: KRMB directives to AP, Telangana.. Funds should be released

ఏపీ, తెలంగాణకు KRMB (Krishna River Management Board) కీలక ఆదేశాలు చేసింది. ప్రాజెక్టుల నిర్వహణకు చేపట్టాల్సిన పనుల కోసం బోర్డు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు. అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాంలపైకి ఇంజినీర్లు, అధికారులు వెళ్లాలని వెల్లడించింది.

బోర్డు నిర్వహణకు 2 రాష్ట్రాలు నిధులు విడుదల చేయాలని ఆదేశించింది కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు. ఈ ప్రాజెక్టుల కింద 15 అవుట్ లెట్లను నెల రోజుల్లో కృష్ణా బోర్డుకు అప్పగించాలని..ప్రాజెక్టుల నిర్వహణ ప్రొటోకాల్స్ పై వారంలో కార్యాచరణ రూపొందించాలని పేర్కొంది కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు.