AP Politics: ఈరోజు జగనన్న తోడు పథకం ద్వారా డబ్బులు జమ

AP Politics: Money deposited through Jagananna Dodu scheme today
AP Politics: Money deposited through Jagananna Dodu scheme today

ఏపీలోని నిరు పేదలకు గుడ్ న్యూస్. చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, చేతివృత్తుల వారికి జగనన్న తోడు పథకం నిధులను సీఎం జగన్ ఇవాళ విడుదల చేయనున్నారు. 3.95 లక్షల మంది ఖాతాల్లో రూ. 417 కోట్ల వడ్డీ లేని రుణాలు జమ చేయనున్నారు.

ఇందులో కొత్త లబ్ధిదారులకు రూ. 10,000, పాతవారికి రూ. 11,000, రూ. 12,000, రూ. 13 వేల చొప్పున అందిస్తారు. అలాగే 5.81 లక్షల మందికి రూ. 13.64 కోట్ల వడ్డీ రీయంబర్స్మెంట్ ను జమచేస్తారు.