అనంతనాగ్ లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం!

ఓ పక్క కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతుంటే…మరో పక్క సరిహద్దుల్లో మాత్రం ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. జమ్ముకాశ్మీర్ లో గత కొద్దిరోజులనుంచి వరుసగా భద్రతా దళాలు ఉగ్రవాదులపై దాడులు జరుపుతున్నారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచీ ఎక్కడో ఒకచోట ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తూనే ఉన్నాయి.

అయితే దేశంలో అసాంఘీక శక్తులను ఏరివేసేందుకు భద్రతాదళాలు సిద్ధమయ్యాయి. ఈ సంవత్సరం మొదటినుండి ఇప్పటివరకు మొత్తం 100 మంది ఉగ్రవాదులను మన జవాన్లు కాల్చి చంపారు. తాజాగా శనివారం ఉల్లార్ గ్రామంలో సైనికులు గాలింపు చర్యలు సాగిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరపారు. ఈ కాల్పుల్లో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. అనంత్‌నాగ్‌ జిల్లాలోని కుల్చోహకాశ్మీర్ లోర్‌ సైనికులు లో ఈ ఎన్కౌంటర్ జరిపారు. కాగా భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. అయితే ఇంకా ఘటనా స్థలంలో ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.