గుంటూరులో దారుణం.. టీడీపీ కార్యకర్త హత్య..

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం అంబాపురంలో వైసీపీ వర్గీయులు టిడిపి కార్యకర్తపై దాడికి దిగారు. అంబాపురం ఎస్సీ కాలనీకి చెందిన బత్తుల చంద్రశేఖర్ (టీడీపీ), దోమతోటి పుల్లయ్య (వైసీపీ)ల మధ్య ఒక బోరుకు సంబంధించి వివాదం నలుగుతుంది. ఆ వివాదం కాస్తా పెద్దదై పోలీస్ స్టేషన్ వరకు చేరింది. దాంతో వారు గత 15 రోజుల నుండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు.

అయితే ఈ తిరుగుతో తీవ్రమైన ఆగ్రహానికి లోనైన ఇరువురు శనివారం రాత్రి చంద్రశేఖర్ తన మిత్రుడు విక్రమ్ తో కలిసి తిరిగి వస్తుండగా ప్రత్యర్థులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ విక్రమ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనలో గాయాల పాలైన వారిని పోలీసులు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.