భీమవరంలో ఘోరం, 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, పొదల్లో బాలిక మృతదేహం

భీమవరంలో ఘోరం, 14 ఏళ్ల బాలికపై అత్యాచారం, పొదల్లో బాలిక మృతదేహం
Minor rape

రెండు రోజుల క్రితం అదృశ్యమైన మునుపు కుమారి అనే 14 ఏళ్ల బాలిక నేడు భీమవరంలో మృతదేహమై లభ్యమైంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని లెప్రసీ కాలనీలో ఆమె ఇంటి సమీపంలోని పొదల్లో మృతదేహం పడి ఉంది బాలిక తల్లిదండ్రులు అంజిబాబు, అరుణ దినసరి కూలీలు.

భీమవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక భీమవరంలో ఏడో తరగతి చదువుతోంది. బుధవారం పాఠశాలకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దాంతో బుధవారం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్థానికులు పొదల్లో బాలిక మృతదేహాన్ని గుర్తించి తమకు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. “అమ్మాయి బంధువు ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చు అని, అతని భార్య కువైట్‌లో దూరంగా ఉంది” అని పోలీసులు అనుమానం వ్యక్తం చేసారు. .

“అనుమానితుడు అతని ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. అతని ఇంట్లో బాలిక బట్టలు కనుగొనబడ్డాయి, బాలిక శరీరంపై గాయాలు ఉన్నాయి” అని పోలీసులు తెలిపారు, పశ్చిమగోదావరి ఎస్పీ, రవి ప్రకాష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.