తెలుగులో కొత్త న్యూస్ ఛానల్… బర్ఖా దత్ సారధ్యం.

barkha dutt will launch News channel in Telugu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగులో మరో కొత్త న్యూస్ ఛానల్ పురుడు పోసుకోనుంది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా 27 న్యూస్ ఛానెల్స్ ఉన్నప్పటికీ తెలుగులో మరో న్యూస్ ఛానల్ పెట్టడానికి ముందుకు వచ్చారు nd టీవీ మాజీ ఎడిటర్ బర్ఖా దత్. తెలుగులో ఆమె సారధ్యంలో రాబోయే ఛానల్ కి ” మోజో” అని పేరు పెట్టారు. తెలుగు తర్వాత ఇదే పేరుతో మరికొన్ని భాషల్లో న్యూస్ ఛానెల్స్ ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తెలుగు విషయానికి వస్తే ఇంతకు ముందు CNN – ibn లో పనిచేసిన రేవతి కుమారి, బీబీసీ లో పని చేసిన హరికిరణ్ రెడ్డి కీలక బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు.