ఒకరోజు ఆలస్యంగా బిసిసిఐ ఎన్నికలు

ఒకరోజు ఆలస్యంగా బిసిసిఐ ఎన్నికలు

బీసీసీఐలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 21న మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల వల్ల సుప్రీం కోర్టు నియమించిన క్రికెట్‌ పాలక కమిటీ (సీఓఏ) వచ్చేనెల 22న కాకుండా ఒక రోజు ఆలస్యంగా 23న నిర్వహించబోతుంది .

ఇదే కాకుండా రాష్ట్ర క్రికెట్‌ సంఘాల ఎన్నికల గడువును కూడా బీసీసీఐ పొడిగించింది. ఈ రెండు రాష్ట్రాలు  హరియాణా, మహారాష్ట్రలలో శాసనసభ ఎన్నికలు కారణంగా  ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చైర్మన్‌ వినోద్‌ రాయ్‌ తెలిపారు