సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ లో బాంబు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ లో బాంబు

ఓ గుర్తు తెలియని దుండగుడు సికింద్రాబాద్ లో బాంబు ఉందంటూ గోపాలపురం పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి చెప్పాడు. ఆదివారం అర్ధరాత్రి 12.30కి ఆ బాంబు పేలుతుందని తెలిపాడు. ఈ సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్​స్య్వాడ్‌తో రైల్వేస్టేషన్‌కి వెళ్లి… స్టేషన్ మొత్తాన్నీ పరిశీలించారు. రాత్రంతా నిద్రపోకుండా అన్నీ చెక్ చేశారు. దీని వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడినప్పటికీ… తమ క్షేమం కోసమే అధికారులు ఇలా చేస్తున్నారని గుర్తించి… పోలీసులకు బాగా సహకరించారు. ఐతే… ఎక్కడా ఏ బాంబూ కనిపించలేదు. ఎందుకైనా మంచిదని మరోసారి కొన్ని కొన్ని ప్రదేశాల్లో చెక్ చేశారు. అప్పటికీ బాంబేదీ కనిపించలేదు. ప్రయాణికులు కూడా తమ తమ లగేజీల్లో ఎవరైనా బాంబు పెట్టేశారేమో అని బాగా చెక్ చేసుకున్నారు. రైళ్లు ఎక్కేవాళ్లు, దిగేవాళ్లు కూడా చెక్ చేసుకున్నారు. అంతా బాగానే ఉండటంతో, ఎక్కడా ఎవ్వరికీ ఎలాంటి అనుమానమూ రాకపోవడంతో… ఏ బాంబూ లేదనీ, వచ్చినది బెదిరింపు కాల్ మాత్రమేనని అనుకున్నారు. మరోవైపు ఎందుకైనా మంచిదని… సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్‌లో సెక్యూరిటీని మరింత పెంచారు.