బాయ్ లాకర్స్ రూమ్ గ్రూప్ మెంబర్ ఆత్మహత్య

‘బాయ్స్‌ లాకర్‌ రూమ్’ పేరుతో సెక్స్ గ్రూప్ క్రియేట్ చేసుకొని హల్ చల్ చేస్తోన్న టీనేజర్స్ తాజాగా దొరికిపోయిన విషయం తెలిసిందే. అయితే నాలుగు స్కూళ్లకు చెందిన విద్యార్థులు… ఓ గ్రూప్ ను క్రియేట్ చేసుకున్నారు. అందులో అమ్మాయిలు, వారి అసభ్య ఫోటోలపైనే చర్చ అంతా చర్చలు సాగించారు. కొందరు క్లాస్ మేట్ అమ్మాయిలను రేప్ చేయడానికి కూడా ప్లాన్ చేశారు. ఈ విషయం కాస్త సైబర్ పోలీసులకు చేరింది. ‘బాయ్స్‌ లాకర్‌ రూమ్’ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. ఢిల్లీకి చెందిన నాలుగు ప్రముఖ స్కూళ్లకు చెందిన విద్యార్థులు ఈ గ్రూప్ ను క్రియేట్ చేసుకున్నారు. ఈ గ్రూప్‌లో మొత్తం 30 మంది ఉన్నారు. అందరూ 17 ఏళ్ల లోపు టీనేజర్సే. వీరంతా కలిసి అమ్మాయిలతో సెక్స్ ఎలా చేయాలి, అమ్మయిలను ఎలా రేప్ చేయాలన్న దానిపై చర్చించుకున్నారు. అమ్మాయిల ఫోటోలు పెడుతూ వీరంతా గ్రూప్‌లో చర్చోచర్చలు సాగించారు. అమ్మాయిల న్యూడ్ ఫొటోలను గ్రూపులో పోస్టు చేసి వారిపై అసభ్యకరమైన కామెంట్లు చేశారు. తమ క్లాస్ మేట్స్ గ్యాంగ్ రేప్ చేయాలని కూడా ప్లాన్ చేశారు.

అంతేకాకుండా అదే గ్రూప్‌లో చాటింగ్ చేసిన 14 ఏళ్ల మైనర్ తన క్లాస్ మేట్ అమ్మాయి పేరు ప్రస్తావిస్తూ… ఫోటోలు కూడా షేర్ చేశాడు. తనకు తెలిసిన అమ్మాయికి చాటింగ్ స్క్రీన్ షాట్లను పంపాడు. అయితే అందులో తన ఫొటోలు కూడా ఉండటంతో ఆ అమ్మాయి స్కూలులో ఫిర్యాదు చేసింది. స్కూల్ యాజమాన్యం ఈ ఘనటపై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. విషయం తెలుసుకున్న ఆ గ్రూపు సభ్యులు.. తమ వివరాలను వెల్లడించిన అమ్మాయి, ఆమెకు సహకరించిన ఇతర మహిళల నగ్న చిత్రాలు వైరల్‌ చేస్తామంటూ బెదిరించారు. ఇంతలో తోటి విద్యార్థులు ఫోన్ చేసి, పోలీసులకు విషయం తెలిసిపోయిందని, వారు వస్తున్నారని హెచ్చరించడంతో భయపడిన బాలుడు తాను ఉంటున్న నివాసంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను నివసిస్తున్న భవంతి 11వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

కాగా విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. ఎటువంటి సూసైడ్ నోట్ కూడా లభించలేదు. అంతకుముందు భవనం కింద పెద్ద శబ్దం వినిపించడంతో స్థానికులు వెళ్లి చూడగా.. బాలుడు రక్తపు మడుగులో పడి ఉండటం చూశారు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. ఫలితం లేకపోయింది. అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి దీపక్ కుమార్ మీడియాకు వివరించారు.