బాబు అందుకే మారారా…?

Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న సమన్వయ కమిటీ సమావేశంలో ఆ తర్వాత ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో నేతలపై విరుచుకుపడ్డారు. అతి విశ్వాసంతో పార్టీకి నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు, చిత్తూరు జిల్లాల నేతలలో అతి విశ్వాసం పెరిగి, పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ఎందుకు సీరియస్ గా తీసుకోవడంలేదని నిలదీశారు. ‘ఇప్పటి వరకు నేను సీరియస్ గా మాట్లాడితే మీరు బాధపడతారని ఆలోచించానని గట్టిగా మాట్లాడకపోతే ఇక ముందు నేను బాదపడాల్సి వస్తుందని, సున్నితంగా చెప్పినప్పుడే అర్దం చేసుకుని ముందుకు సాగాలి రఫ్ గా మాట్లాడే వరకు తెచ్చుకోవద్దు. మీరు ఎంత బాదపడినా పర్వాలేదు ఈ ఆరు నెలల కటువుగానే ఉంటానని చంద్రబాబు స్పష్టం చేయడంతో నేతలంతా కంగుతిన్నారట. అయితే సభ్యత్వ నమోదులో కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైనే ప్రధనంఘా ద్రుష్టి పెట్టిన చంద్రబాబు ఈ విధమైన కామెంట్స్ చేశారు. మీరు చేసే తప్పులకు పార్టీని నష్టపోనివ్వనని, మీ వల్ల నేను ప్రజల్లో వీక్ అవుతున్నానని, మిమ్మల్ని గట్టిగా మందలిస్తే నేనైనా ప్రజల్లో బలపడతానని ఎవరు ఏమి అనుకున్నా పర్వాలేదని ఈ ఆరు నెలలు ఇలాగే ఉంటానని సిఎం హెచ్చరించడం ఇప్పుడు చర్చలకు తావిస్తోంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎక్కడ ఉన్నాడంటూ ఆరా తీసిన ఆయన సీనియర్లు సమావేశానికి ఎగ్గొట్టడంతో అసహనం వ్యక్తం చేస్తూ సీనియర్లు కూడా ఇన్ని సార్లు చెప్పించుకుంటే ఎలా అని నిలదీశారు. ప్రజల్లో పార్టీ పట్ల ఆదరణ బాగుందని, కార్యకర్తల్లో ఉత్సాహం ఉందని, లోపం ఎక్కడైనా ఉందంటే అది నాయకుల్లోనేనని చంద్రబాబు నిర్మోహమాటంగా మొహానే చెప్పేశారు దీంతో ఎప్పుడూ కూల్ గా ఉండే చంద్రబాబు వరుస దుష్ఫలితాల వలనే మారిపోయారని విశ్లేషకులు భావిస్తున్నారు.