భరత్‌, చరణ్‌ల మద్య నిల్చున్న జక్కన్న?

charan not attend for mahesh babu bharath ane nenu event

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. రేపు ఈ చిత్రం ఆడియోను ఎల్బీ స్టేడియంలో విడుదల చేయబోతున్నారు. మొదట ఈ ఆడియో వేడుకకు ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌లు ప్రత్యేక అతిథులుగా హాజరు కాబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కొరటాల శివ కోరిక మేరకు ఎన్టీఆర్‌ మరియు చరణ్‌లు ఈ వేడుకలో పాల్గొనేందుకు ఓకే చెప్పారు. అయితే రామ్‌ చరణ్‌ను ఆడియో వేడుకకు వెళ్లవద్దంటూ రాజమౌళి సూచించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ల కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది. ఈ సమయంలో ఇద్దరు కలిసి కనిపిస్తే సినిమా వెయిట్‌ తగ్గుతుందనేది జక్కన్న అభిప్రాయం.

రాజమౌళి సూచన మేరకు ఎన్టీఆర్‌ మాత్రమే ‘భరత్‌ అనే నేను’ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొనబోతున్నాడు. రామ్‌ చరణ్‌ మాత్రం ఎన్టీఆర్‌ హాజరు అవుతున్న కారణంగా దూరంగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. మహేష్‌బాబుతో చరణ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈమద్య రంగస్థలం సక్సెస్‌ సందర్బంగా స్వయంగా చరణ్‌కు మహేష్‌బాబు విశెష్‌ చెప్పడం జరిగింది. దాంతో చరణ్‌ భరత్‌ అనే నేను బహిరంగ సభకు హాజరు అవుతాడని అంతా భావించారు. కాని రాజమౌళి మాస్టర్‌ మైండ్‌తో ఆలోచించి ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే వెళ్లాల్సిందిగా చెప్పాడు. దాంతో ఎన్టీఆర్‌ రేపు ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. చరణ్‌ మాత్రం దూరంగా ఉంటున్నాడు.