గణేష్‌ మండపం వద్ద గొడవ, ఒకరి మృతి

గణేష్‌ మండపం వద్ద గొడవ, ఒకరి మృతి
Ganesh Pandal

సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామంలో బుధవారం గణేష్‌ మండపాల వద్ద రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

ఈ దాడిలో దొరిగల్లుకు చెందిన అనంతయ్య అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా ద్విచక్రవాహనాన్ని నడపడంతో ఉద్రిక్తత మొదలైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో ఘర్షణకు దిగడంతో అనంతయ్య మృతి చెందాడు.

క్షతగాత్రులను కదిరి ఆసుపత్రికి తరలించామని, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా దొరిగల్లు వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ యతీంద్ర తెలిపారు.