కరోనా బాదితుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

కరోనా బాదితుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్

కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరడం, క్వారంటైన్ చికిత్స అనంతరం గడువు పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్ళిన వారందరికి రెండువేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. క్వారంటైన్ ముగిసిన వాళ్లూ జాగ్రత్తలు పాటించాలని, ప్రతి వారం పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

అయితే నేడు సీఎం జగన్ సమీక్ష అనంతరం క్వారంటైన్ లో చికిత్స పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లే వారు పాటించాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాలని ఆదేశించారు. క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన వ్యక్తులు ప్రతి వారం పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు, పరీక్షల నిర్వహణ, ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల వివరాలను అధికారులు జగన్‌కి వివరించారు. క్వారంటైన్ కేంద్రాల్లో కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించాలని, రోజువారి కరోనా పరీక్షల నిర్వహణా సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. దీంతో రోజుకు 4 వేల పరీక్షలు నిర్వహించేలా సామర్థ్యం పెంచుతామని సీఎంకు అధికారులు తెలిపారు.