సారీ సంపత్.. ఎవ్వరూ నమ్మడం లేదు

CM KCR Counter Attack To Congress MLA Sampath In Telangana

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

CM KCR Counter Attack To Congress MLA Sampath In Telangana

కాంగ్రెస్ మైండ్ గేమ్ మిస్ ఫైర్ అయింది. మీరాకుమార్ కు మద్దతుదా ఆత్మప్రబోధానుసారం ఆమెకే చాలా మంది ఓటేస్తారన్న తెలంగాణ కాంగ్రెస్ నేత సంపత్ మాటలు కామెడీగా ఉన్నాయి. పైగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కేసీఆర్ కు షాకిస్తారన్న వ్యాఖ్యలకు, వాస్తవ పరిస్థితికి పొంతనే లేదు. దీంతో సంపత్ మైండ్ గేమ్ ఆడుతున్నారని కేసీఆర్ కు అర్థమైపోయింది.

కాంగ్రెస్ నేతలు అనవసరంగా రెచ్చగొట్టారు కాబట్టి.. వారిలో కొంతమందిని లాగి కోవింద్ కు ఓటేయించాలని కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. దీంతో అవాక్కవడం పీసీసీ, సీఎల్పీ వంతౌతోంది. సంపత్ అనవసరంగా కేసీఆర్ ను కెలికారని, ఇప్పుడు ఆయన దెబ్బను కాచుకోవడం మామూలు విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. కాంగ్రెస్ సీనియర్లనే సైలంట్ గా కారెక్కించిన కేసీఆర్ కు.. ఈ విషయం పెద్ద లెక్క కాదనే అభిప్రాయం వస్తోంది.

అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ మైండ్ గేమ్ తో రాష్ట్రపతి ఎన్నికల రాజకీయం వేడెక్కింది. దీంతో తమ ప్రమేయం లేకుండానే కాంగ్రెస్ వీకౌతోందని బీజేపీ సంబరపడుతోంది. బీజేపీ కోసం కేసీఆర్ తమతో వైరం పెంచుకోవడమేంటని కాంగ్రెస్ నేతలు ఇదైపోతున్నారు. కానీ మోడీ మరో టర్మ్ ప్రధానిగా వస్తారని కేసీఆర్ కు తెలుసు. అందుకే ఆయన్ను మంచి చేసుకోవడానికే ఇంత చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం పాత వ్యూహాలనే పట్టుకుని వేలాడుతున్నారు.

మరిన్ని వార్తలు:

చైనాకు షాకిచ్చిన భారత్

ఆ సభలకి నో పోలీస్ పర్మిషన్.