ముదురుతున్న నీటి యుద్ధాలు

ముదురుతున్న నీటి యుద్ధాలు

ఏపీ, తెలంగాణ మధ్య నీటి యుద్ధాలు ముదురుతున్నాయి. కృష్ణ నదిపై ప్రాజెక్టు ల నిర్మాణం విషయంలో అంధ్ర , తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం ముదురుతోంది … కృష్ణ నదిపై ఆంధ్రా అక్రమంగా అనుమతులు లేకుండా ప్రాజక్టు లు నిర్మిస్తుందని తెలంగాణ ఆరోపిస్తుండగా , మీరే అక్రమ ప్రాజక్టు లు నిర్మించారని ఆంధ్రప్రదేశ్ ప్రత్యారోపణ చేస్తుంది. దీంతో రాష్ట్రంలోఇప్పుడు జగన్‌ పై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. మంత్రి వేముల వైఎస్ఆర్, జగన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా మరో మంత్రి కూడా జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దొంగ అయితే.. వైఎస్ జగన్ గజదొంగ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం స్పందించి ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. ఏపీ నిర్మిస్తున్న పోతిరెడ్డి ప్రాజెక్టు అక్రమమేనని ఆరోపించారు.

కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క నిజాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు మంత్రి పువ్వాడ. కృష్ణా నీటిలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటాను వదులుకోబోమని స్పష్టం చేశారు. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై గతంలోనే కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు.