ఆంధ్ర రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్ర రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్ర రాష్ట్రంలో కరోనా వైరస్ పై యుద్ధంలో మన దేశంలోనే అత్యధిక కేసులతో ముందంజలో ఉంది. దీనితో గత రెండు వారాల నుంచి కరోనా తీవ్రత భారీగా పెరిగింది. ఈ లెక్కల ప్రకారం గత రెండు వారాల సగటు 70 గా ఉంది. ముఖ్యంగా లాస్ట్ నాలుగు రోజులు అయితే ప్రతీ రోజు 80 పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే వస్తున్నాయి.

అలా తాజాగా వచ్చిన జాబితాను కూడా ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు తెలిపారు. గత 24 గంటల్లో 5783 సాంపిల్స్ ని పరీక్షించగా వాటిలో 82 మందికి కోవిడ్19 పాజిటివ్ వచ్చినట్టు వెల్లడించారు. అయితే ఈ 82 కేసుల్లో ఏకంగా 40 కేసులు ఒక్క కర్నూల్ జిల్లా నుంచే నమోదు కావడం ఆశ్చర్యకరం. ఇలా గత 24 గంటల్లో నమోదు కాబడిన ఈ కేసులతో 1259 కి ఈ లిస్ట్ చేరుకుంది. ఇప్పటి వరకు 258 మంది డిశ్చార్జ్ కాగా 31 మరణాలు సంభవించాయి.