Corona Updates: భారత్ లో కరోనా బారిన పడిన 4 వేల మంది.. 63 జేఎన్1 కేసులు

Corona Updates: There is a commotion of Covid in Hyderabad.. Be alert: Doctors
Corona Updates: There is a commotion of Covid in Hyderabad.. Be alert: Doctors

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతుున్నాయి. తాజాగా భారత్లో కొవిడ్‌ క్రియాశీలక కేసులు 4 వేలు దాటాయి. మరోవైపు న్యూ వేరియంట్ జేఎన్‌.1 కేసులూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో 628 కొత్త కేసులు నమోదవ్వగా, క్రియాశీలక కేసులు 4,054 ఉన్నాయి. మరోవైపు కరోనా వైరస్‌ కొత్త ఉపరకం జేఎన్‌.1 కేసులు ఆదివారానికి 63కు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

వీటిలో గోవాలో 34, మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయని అధికారిక వర్గాలు తెలిపాయి. దాని బారిన పడినవారిలో 92 శాతం మంది ఇంట్లో ఉండే చికిత్స పొందుతున్నారని, ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య పెరగటం లేదని పేర్కొన్నాయి. కేరళలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయని వెల్లడించాయి.