ఇంగ్లండ్‌ జట్టుకి సోకిన కరోనా

ఇంగ్లండ్‌ జట్టుకి సోకిన కరోనా

ఇంగ్లండ్‌ జట్టులో కరోనా కలకలం రేపింది. జట్టులోని ముగ్గురు ఆటగాళ్లతో పాటు మరో నలుగురి సిబ్బందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా కరోనా పాజిటివ్‌ అని తేలిన ఆటగాళ్లను ఇప్పటికే క్వారంటైన్‌కు తరలించినట్లు ఈసీబీ తెలిపింది.

అయితే పాక్‌తో వన్డే సిరీస్‌ నేపథ్యంలో మ్యాచ్‌లు యథాతధంగా ఉంటాయని ఇంగ్లండ్‌ బోర్డు తెలిపింది. కాగా మోర్గాన్‌ గైర్హాజరీలో బెన్‌ స్టోక్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు​. ఇక పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌ అనంతరం టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది.