Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ‘మెహబూబా’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ను తెచ్చుకున్న విషయం తెల్సిందే. ఆకాష్ పూరి హీరోగా పరిచయం అయిన ఈ చిత్రంలో నేహా హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో పూరి మార్క్ ఎక్కడా కనిపించలేదని, ఆయన ఇడియట్ మరియు పోకిరి సినిమాల ప్రతిభ ఏమైందంటూ సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. సాదారణ ప్రేక్షకులు కూడా పూరి ఇలాంటి సినిమా తీస్తాడని ఊహించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్రంపై నమ్మకంతో దిల్రాజు హోల్సేల్గా రైట్స్ను కొనుగోలు చేయడం జరిగింది. దాదాపు 11 కోట్లకు ఈ చిత్ర రైట్స్ను నిర్మాత దిల్రాజు దక్కించుకోవడం జరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా దిల్రాజు ఈ చిత్రాన్ని విడుదల చేశాడు. సినిమాకు మొదటి రోజే డిజాస్టర్ టాక్ రావడంతో దిల్రాజు భారీగా నష్టపోయాడు. అసలు ఇప్పటి వరకు దిల్రాజు పెట్టిన పెట్టుబడిలో కనీసం సగం కూడా రాలేదని సమాచారం అందుతుంది. దిల్రాజుకు ఈ చిత్రం వల్ల దాదాపుగా 8 కోట్ల మేరకు నష్టం రావచ్చు అంటూ సినీ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మెహబూబాను దిల్రాజు గుడ్డిగా నమ్మడంతో ఈ పరిస్థితి దాపరించింది అంటూ కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ వివరాలు సినిమా యూనిట్ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తుంది. దిల్రాజు ఈ చిత్రంకు పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో పాటు, పూరి ఈ సినిమాకు భారీగా పెట్టిబడి పెట్టడం కూడా జరిగింది. పూరికి ఈ చిత్రం వల్ల ఏకంగా 25 కోట్ల మేరకు నష్టం అంటూ సమాచారం అందుతుంది.