రకుల్‌పై దిల్‌రాజు సంచలన ఆరోపణలు

dil-raju-sensational-comments-on-rakul-preet-singh-behavior
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌ లక్కీ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గత రెండు సంవత్సరాలుగా స్టార్‌ హీరోయిన్‌గా దూసుకు పోతుంది. అయితే ఈ సంవత్సరంలో మాత్రం ఆమెకు అంతగా కలిసి రాదని ముందే తేలిపోయింది. గత సంవత్సరం మహేష్‌బాబుతో పాటు ఇంకా పలువురు స్టార్స్‌తో నటించిన ఈ అమ్మడు తెలుగులో ఇకపై స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకోలేక పోవచ్చు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. తాజాగా దిల్‌రాజు ఈమెను ఒక చిత్రం నుండి తొలగించాడు అని, ఆమె ప్రవర్తనపై దిల్‌రాజు ఆరోపణలు చేస్తున్నాడు అంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

మహేష్‌బాబు 25వ చిత్రంను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు కలిసి నిర్మించబోతున్న విషయం తెల్సిందే. వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ జరగబోతున్న ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక జరుగుతుంది. త్వరలోనే ఎంపిక పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర కోసం పూజా హెగ్డే మరియు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లను దర్శకుడు వంశీ పరిశీలిస్తున్నాడు. అయితే దిల్‌రాజు మాత్రం రకుల్‌ పేరును పరిగణలోకి తీసుకోవద్దంటూ దర్శకుడికి సూచించాడట.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ షూటింగ్‌ సమయంలో ఇబ్బంది పెట్టడంతో పాటు, ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు అంటూ దిల్‌రాజు ఆరోపించాడు. ఆమె పని చేసిన నిర్మాతలు తన వద్ద చెప్పారంటూ దిల్‌రాజు దర్శకుడితో చెప్పినట్లుగా తెలుస్తోంది. దాంతో వంశీ ఆమెను పక్కకు పెట్టేశాడు. ఇండస్ట్రీలో ఇలాంటి పేరు వస్తే మళ్లీ పుంజుకోవడం కష్టం అనే విషయం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ గ్రహించాలి. ఇప్పటికైనా తన పద్దతిని మార్చుకుంటుందేమో చూడాలి.