చూసినా చూడకున్నా సినిమాలు తీస్తూనే ఉంటాడట

http://telugubullet.com/wp-content/uploads/2017/06/director-vamshi-says-about-.jpg

టాలీవుడ్‌లో ఎన్నో క్లాసిక్‌ చిత్రాలను అందించిన వంశీ గత కొన్ని సంవత్సరాలుగా వరుసగా అట్టర్‌ ఫ్లాప్‌ చిత్రాలనే ఇస్తున్నాడు. వంశీ సినిమాలు అంటే ఒక రకమైన ఫీలింగ్‌ ప్రేక్షకుల్లో పడిపోయింది. గోదావరి అందాలు, పల్లెటూరి పచ్చదనం ఇలా వంశీ సినిమాలు ఉంటాయని అంతా అనుకుంటూ ఉంటారు. అదే ఇప్పుడు చూపించినా కూడా వంశీ సినిమాలను నచ్చడం లేదు. వంశీ సినిమాల్లో ఆ మార్క్‌తో పాటు, కొత్తదనంను కూడా ఈ తరం ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కొత్తదనంతో ఉంటేనే సినిమాలను ప్రేక్షకులు ఆధరిస్తారు అనే విషయం వంశీకి ఇప్పటికి కూడా అర్థం అయినట్లుగా లేదు.

‘ష్యాషన్‌ డిజైనర్‌’ చిత్రంతో అదే తరహా మూస కథ, కథనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అట్టర్‌ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్న ‘ష్యాషన్‌ డిజైనర్‌’ చిత్రం తర్వాత వంశీ సినిమాలకు దూరం అయితే బాగుంటుందని చాలా మంది అభిప్రాయ పడ్డారు. కాని వంశీ మాత్రం తాను బతికి ఉన్నంత కాలం సినిమాలు చేస్తూనే ఉంటాను అంటూ చెబుతున్నాడు. తన సినిమాలు చూస్తున్నారా, చూడటం లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తాను అంటూ ఈయన చెబుతున్నాడు. ఇంకా ఒకటి రెండు సినిమాలు ఛాన్స్‌ వస్తే రావచ్చు కాని, వంశీతో సినిమాలు నిర్మించేందుకు ఏ నిర్మాత కూడా ముందుకు రాకపోవచ్చు. త్వరలో వంశీ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కాబోతుంది. ఆ సినిమాకు కథ మరియు మాటలను కృష్ణ భగవాన్‌ అందించబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న ఆ సినిమా త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.

చూసినా చూడకున్నా సినిమాలు తీస్తూనే ఉంటాడట - Telugu Bullet