Election Updates: కడప ఎంపీ సీటు మార్చిన జగన్.. ఆ స్థానం ఎవరికో..?

Election Updates: Jagan has changed Kadapa MP seat.
Election Updates: Jagan has changed Kadapa MP seat.

పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గర పడుతున్ననేపథ్యంలో సీఎం జగన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. కడప ఎంపీ సీటు మార్చేందుకు జగన్ రెడీ అయ్యారట. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి బదులుగా అభిషేక్ రెడ్డి ఖరారు అయినట్లు సమాచారం అందుతోంది.

వైయస్ భాస్కర్ రెడ్డి అన్న వైయస్ ప్రకాష్ రెడ్డి మనవడు వైయస్ అభిషేక్ రెడ్డి. ఇప్పటికే కడప బాధ్యతలు కూడా అభిషేక్ రెడ్డికి అప్పగించారట. ప్రస్తుతం విశాఖలో ఉంటున్న అభిషేక్ రెడ్డి కడపకు వచ్చేసారని సమాచారం. అటు మైలవరం వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్ ఫైనల్‌ అయ్యారని సమాచారం. విజయవాడ పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా పోతిన మహేష్ చేయనున్నారట. గుంటూరు వైసీపీ ఎంపీగా విడుదల రజనీ..గుంటూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలారు రోసయ్యను అనుకుంటున్నారట జగన్‌.