Election Updates: డీకే సోదరులతో వైయస్ షర్మిల సమావేశం

Election Updates: YS Sharmila meeting with DK brothers
Election Updates: YS Sharmila meeting with DK brothers

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల బుధవారం బెంగళూరులో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేశ్ (ఎంపీ)తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సదాశివనగరలోని డీకే నివాసంలో ఆమె ఏపీ ఎన్నికల అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ ఎన్నికల కోసం కర్ణాటక నుంచి ప్రముఖ నేతల ప్రచారంపై ఆమె డీకేకు పలు ప్రతిపాదనలు చేశారని తెలిసింది.

ఇప్పటికే కర్ణాటక నుంచి ఏపీలో ప్రచారం కోసం 10మంది నేతలతో కూడిన ప్రచారకుల జాబితాను తయారు చేయనున్నట్లు పీసీసీ ఇటీవల వెల్లడించింది. ఈ జాబితాలో డీకే శివకుమార్ ఉన్నారు. కర్ణాటకలో ఈనెల 12న రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండగా ఆ రోజున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలబురగిలో అభ్యర్థి తరఫున ప్రచారానికి వెళ్తారు. అనంతరం ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణాల్లో ప్రచారానికి వెళ్లే నేతల వివరాలను వెల్లడిస్తారు.